పరిశుద్ధ గ్రంథము
పాత నిబంధన
ఆదికాండము
10వ అధ్యాయము
- Verse 1: ఇది నోవహు కుమారుడగు షేము హాము యాపె తను వారి వంశావళి. జలప్రళయము తరువాత వారికి కుమారులు పుట్టిరి.
- Verse 2: యాపెతు కుమారులు గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.
- Verse 3: గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.
- Verse 4: యావాను కుమారులు ఏలీషా తర్షీషు కిత్తీము దాదోనీము అనువారు.
- Verse 5: వీరినుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారము, వారివారి భాషలప్రకారము, వారివారి వంశముల ప్రకారము, ఆ యా దేశములలో వారు వేరైపోయిరి.
- Verse 6: హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
- Verse 7: కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా అనువారు. రాయమా కుమారులు షేబ దదాను అనువారు.
- Verse 8: కూషు నిమ్రోదును కనెను. అతడు భూమిమీద పరాక్రమశాలియై యుండుటకు ఆరంభించెను.
- Verse 9: అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టియెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తికలదు.
- Verse 10: షీనారు దేశములోని బాబెలు ఎరెకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు.
- Verse 11: ఆ దేశములోనుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను రహోబోతీరును కాలహును
- Verse 12: నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను; ఇదే ఆ మహా పట్ట ణము.
- Verse 13: మిస్రాయిము లూదీయులను అనామీయులను లెహాబీయులను నప్తుహీయులను
- Verse 14: పత్రుసీయులను కస్లూ హీయులను కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూ హీయులలోనుండి వచ్చిన వారు.
- Verse 15: కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను
- Verse 16: హివ్వీయులను అర్కీయులను సినీయులను
- Verse 17: అర్వాదీయు లను సెమారీయులను హమాతీయులను కనెను.
- Verse 18: తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను.
- Verse 19: కనానీయుల సరిహద్దు సీదోనునుండి గెరారుకు వెళ్లు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయిము లకు వెళ్లు మార్గములో లాషావరకును ఉన్నది.
- Verse 20: వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషల ప్రకారము తమతమ దేశములనుబట్టియు జాతులను బట్టియు హాము కుమారులు.
- Verse 21: మరియు ఏబెరుయొక్క కుమారులందరికి పితరుడును, పెద్దవాడయిన యాపెతు సహోదరుడునగు షేముకు కూడ సంతానము పుట్టెను.
- Verse 22: షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.
- Verse 23: అరాము కుమారులు ఊజు హూలు గెతెరు మాషనువారు.
- Verse 24: అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.
- Verse 25: ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకనిపేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను.
- Verse 26: యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మా వెతును యెరహును
- Verse 27: హదోరమును ఊజాలును దిక్లాను
- Verse 28: ఓబాలును అబీమాయెలును షేబను
- Verse 29: ఓఫీరును హవీలాను యోబాబును కనెను. వీరందరు యొక్తాను కుమారులు.
- Verse 30: మేషానుండి సపారాకు వెళ్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలము.
- Verse 31: వీరు తమతమ వంశముల ప్రకారము తమతమ భాషలప్రకారము తమతమ దేశ ములనుబట్టియు తమతమ జాతులనుబట్టియు షేము కుమారులు.
- Verse 32: వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలోనుండి జనములు భూమిమీద వ్యాపించెను.